ఈనెల 28న జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదు . జగన్ సహా ఈ కేసులో నిందితులంతా ఈ నెల 28న కోర్టుకు రావాల్సిందిగా సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే! సీబీఐ వరుస చార్జిషీట్లు, వాటిపై కోర్టు సమన్లు జారీ చేయడం వల్ల తమకు ఇబ్బంది అవుతోందని, దర్యాప్తు మొత్తం పూర్తయ్యే వరకు కోర్టు విచారణ వాయిదా వేయాలని విజయ సాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో సోమవారం విచారణ జరిగింది.
దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ... 'వారు హాజరవుతున్నది మొదటిసారి కదా! హాజరు కానీయండి' అని పిటిషన్ తోసిపుచ్చారు .