Headlines News :
eenadu andhrajyothy sakshi vaartha suryaa andhrabhoomi andhraprabha prajasakti timesofindia thehindu deccanchronicle hindustantimes india today indian express
tv9 telugu abn andhrajyothy ntv telugu tv5 telugu sakshi telugu studion telugu maha news telugu hmtv telugu rknews telugu rajnews telugu bhakti telugu tnews telugu ctp telugu xtra tv telugu etv 2 telugu youtube facebook cricinfo
Showing posts with label Lakshmi parvathi. Show all posts
Showing posts with label Lakshmi parvathi. Show all posts

Lakshmi Parvathi Fire On Purandeswari

Written By Unknown on Monday, 6 May 2013 | 15:16


Lakshmi Parvathi Interview To ABN

Written By Unknown on Tuesday, 22 January 2013 | 17:27

NTR's family erasing his memories - Lakshmi Parvathi

Written By Unknown on Wednesday, 19 December 2012 | 19:06

Laxmi Parvathi speaks on NTR's Statue

Written By chennaitelugupeople on Tuesday, 11 December 2012 | 22:04



Laxmi Parvathi speaks on NTR's Statue  Laxmi Parvathi speaks on NTR's Statue  Laxmi Parvathi speaks on NTR's Statue

Lakshmi Parvati Attacks Purandeshwari, Babu

Lakshmi Parvathi killed NTR - Nannapaneni Rajakumari

Written By chennaitelugupeople on Monday, 27 August 2012 | 20:22



Lakshmi Parvathi killed NTR - Nannapaneni Rajakumari  Lakshmi Parvathi killed NTR - Nannapaneni Rajakumari

లక్ష్మీపార్వతి జగన్‌వద్ద తాకట్టు పెట్టారు: టిడిపి నిప్పులు


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ప్రధానికి లేఖ రాసిన ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి పైన ఆ పార్టీ నేతలు సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లక్ష్మీ పార్వతి తమ నేత గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తామని హెచ్చరించారు. ఆమె తీరు పాలకుండలో బల్లిలా ఉందని విమర్శించారు. స్వర్గ
ీయ నందమూరి తారక రామారావు ఆగర్భ శత్రువుల అడుగులకు ఆమె మడుగులు ఒత్తుతున్నారని మండిపడ్డారు.
లక్ష్మీ పార్వతి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిలు జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ స్వర్గీయ ఎన్టీఆర్‌ను మరోసారి చంపేశారని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ ఆగర్భ శత్రువుల మోచేతి నీళ్లు తాగే వీరికి ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత ఎంతమాత్రమూ లేదన్నారు. ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని లక్ష్మీ పార్వతి జగన్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కుటుంబంలో ముసలానికి యార్లగడ్డనే కారణమన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి ప్రభుత్వంపై వేరుగా మండిపడ్డారు. ప్రజలకు పొదుపు సూచనలు చేయడం కాదని వారి సమస్యలు తీర్చాలని హితవు పలికారు. ప్రభుత్వ కార్యాలయాలలో, మంత్రుల ఇళ్లలో పొదుపు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యుత్ సమస్యపై శ్వేత పత్రం విడుదల చేయాలని, లేదంటే తామే బ్లాక్ పేపర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ రాష్ట్రంలో ప్రతి స్కీమ్ కూడా స్కాంతోనే మొదలవుతోందన్నారు. విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమన్నారు. ప్రజావసరాలకు దూరంగా ప్రభుత్వం ఆలోచన ఉందన్నారు. ముఖ్యమంత్రి తమకు సమయం ఇస్తే విద్యుత్ పరిస్థితిపై ఆయనకు వివరిస్తామన్నారు. విద్యుత్ శాఖకు కనీసం మంత్రిని కూడా నియమించుకోలేని పరిస్థితిలో కాంగ్రెసు ఉందన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు ప్రభుత్వానికి సెలవుగానే ఉందన్నారు.
 


లక్ష్మీపార్వతిని కడిగేసిన నన్నపనేని



తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో సహా విదేశీ పర్యటనలకు వెళ్లడాన్ని తప్పు పడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ప్రధానమంత్రికి లేఖ రాయడాన్ని టిడిపి నేత నన్నపనేని రాజకుమారి సోమవారం తప్పు పట్టారు. లక్ష్మీ పార్వతికి నన్నపనేని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తన కుటుంబంతో అమెరికా వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. లక
్ష్మీ పార్వతి కూడా విదేశాలకు వెళుతుంటారు కదా అన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావును మోసం చేసి సంపాదించిన నగలు, పట్టుచీరలు తదితర విలువైన వస్తువులు దాచుకోవడానికే ఆమె విదేశీయానం చేస్తుంటారా అని ఎద్దేవా చేశారు. లక్ష్మీ పార్వతి వల్లనే ఎన్టీఆర్‌కు భారతరత్న రాలేదని ఆరోపించారు. చంద్రబాబు పైన అనవసర విమర్శలు చేసినందుకు ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే బాబు విదేశాలకు వెళ్తే తప్పేంటమన్నారు.
ఎన్టీఆర్ పదవితో పాటు ప్రాణం పోవడానికి లక్ష్మీపార్వతియే కారణమని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రతిష్టకు ఆమె మచ్చ తీసుకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ ఎలా చనిపోయారనే విషయాన్ని బయట పెడితే లక్ష్మీ పార్వతి తల ఎత్తుకు తిరగలేరన్నారు. ఆయన ఎలా చనిపోయారో అప్పుడే వివరించామని నన్నపనేని అన్నారు.
కాగా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ గత 15 సంవత్సరాలుగా చేసిన విదేశీ పర్యటనలు, విదేశాలలో వారి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాల్సిందిగా లక్ష్మీ పార్వతి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను డిమాండ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. తన అల్లుడైన చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారని ఆమె ఆ లేఖలో తెలిపారు.
చంద్రబాబు విదేశీ పర్యటన వ్యక్తిగతమైతే ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదని, కానీ లోగడ తెహల్కా పత్రిక చంద్రబానును దేశంలోని అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకునిగా ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. బాబుకు సింగపూర్, మలేషియాలలో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొందని ఆమె తెలిపారు. కాబట్టి దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారు.
గతంలో వీటిపై విచారణ జరపాల్సిందిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కోర్టుకు నివేదించినా అత్యంత దురదృష్టకరమైన రీతిలో ఆ పిటిషన్ తిరస్కరణకు గురైందని ఆమె అన్నారు. చంద్రబాబు పార్టీ ద్వారా 2009 తర్వాత సిఎం రమేష్, వైవి సుజనాచౌదరి ద్వారా రాజ్యసభలో అడుగుపెట్టారని, ప్రజా జీవితంలో పెద్దగా కనిపించని వీరు రాజ్యసభకు వెళ్లడం ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించిందని ఆమె అన్నారు.
2009 సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఇద్దరి ద్వారానే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోసం మనీ లాండరింగ్ చేసిందని ఆమె ఆరోపించారు. మనీ లాండరింగ్ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి భాగస్వామ్యం ఉన్నట్లు హసనీ అలీ వెల్లడించిన విషయం జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చిందని ఆమె గుర్తు చేశా్రు. అప్పట్లో హసన్ అలీ వ్యవహారం బయటకు వచ్చిన కొద్ది రోజుల్లనే చంద్రబాబు హడావిడిగా విదేశీ పర్యటనకు వెళ్లారని ఆమె అన్నారు.


Lakshmi Parvathi sent letter to PM on Chandrababu foreign tour

USA - Lakshmi Parvathi on AP politics at Dallas - Tv9

Written By chennaitelugupeople on Tuesday, 31 July 2012 | 07:48

Tollywood News

More Tollywood News here...>>> »
 
Support : chennai telugu people | CTP | Telugu People
Copyright © 2011. Chennai telugu people - All Rights Reserved
Template Modify by Sivakumar naidu Inspired CTP
Proudly powered by ctp